వైసీపీ ప్రభుత్వంపై జేసీ పవన్రెడ్డి ఫైర్
ABN , First Publish Date - 2020-08-08T04:09:31+05:30 IST
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్రెడ్డిని మరోసారి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం
అనంతపురం : టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్రెడ్డిని మరోసారి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విడుదలైన 24 గంటల్లోపే వారిద్దర్నీ అరెస్ట్ చేయడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ అరెస్ట్పై జేసీ పవన్ రెడ్డి స్పందించారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బెయిల్ పై విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డిపై మళ్లీ అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్ ఎవరినీ కులం పేరుతో దూషించలేదని.. తనకు ఆరోగ్యం బాగోలేదని త్వరగా పంపించాలని సీఐ దేవేంద్రను అడగారని పవన్ చెప్పుకొచ్చారు.
కాగా.. అరెస్ట్ చేసిన జేసీని మొదట ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం గుత్తి మేజిస్ట్రేట్ ముందు ఆయన్ను పోలీసులు హాజరుపరిచారు. 14 రోజుల పాటు మేజిస్ట్రేట్ రిమాండ్కు ఆదేశించారు. దీంతో కడప జిల్లా సబ్ జైలుకు తరలించారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో అరెస్టయిన జేసీ ప్రభాకర్రెడ్డి, అస్మిత్ రెడ్డి కండీషన్ బెయిల్పై కడప జైలు నుంచి గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. ఇవాళ మళ్లీ ఆయన్ను కడప జైలుకు తరలించారు.