రైతులకు ఆధునిక యంత్ర పరికరాలు : జేసీ
ABN , First Publish Date - 2020-08-11T10:16:13+05:30 IST
ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను గ్రూపుల ద్వారా అద్దె ప్రాతిపదికను అన్నదాతలకు అందించేందుకు రైతు భరోసా కేంద్రం వద్ద కస్టమ్ హైరింగ్ ..
కలెక్టరేట్, ఆగస్టు 10: ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను గ్రూపుల ద్వారా అద్దె ప్రాతిపదికను అన్నదాతలకు అందించేందుకు రైతు భరోసా కేంద్రం వద్ద కస్టమ్ హైరింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని జేసీ కిషోర్కుమార్ ఆదేశించారు. సోమవారం తన కార్యాలయంలోని వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతు మిత్ర గ్రూపులు, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను ఏర్పాటు చేయాలని , లేదా గ్రామానికి ఐదు లేదా ఆరుగురు వేర్వేరు కుటుంబాలకు చెందిన రైతులు గ్రూపులుగా ఏర్పడొచ్చని చెప్పారు. వ్యవసాయ శాఖ జేడీ ఆశాదేవి, డీడీ నాగభూషణ్, ఉద్యాన శాఖ డీడీ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.