జగనన్న లేఅవుట్లలో అన్ని వసతులు కల్పించాలి
ABN , First Publish Date - 2022-05-26T04:47:16+05:30 IST
ప్రభుత్వం చేపడుతున్న పేదలందరికీ ఇల్లులో భాగంగా వేస్తున్న జగనన్న లేఅవుట్లలో అన్ని వసతులు వేగంగా కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ సూచించారు.
మనుబోలు, మే 25: ప్రభుత్వం చేపడుతున్న పేదలందరికీ ఇల్లులో భాగంగా వేస్తున్న జగనన్న లేఅవుట్లలో అన్ని వసతులు వేగంగా కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ సూచించారు. మండలంలోని కట్టువపల్లి, బద్దెవోలు లేఅవుట్లను బుధవారం ఆయన పరిశీలించారు. అలాగే ఆ రెండు పంచాయతీల్లోని సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. లేఅవుట్ల నిర్మాణాలలో ఎందుకింత జాప్యం జరుగుతోందని సిబ్బందిని ప్రశ్నించారు. కరెంటు, మంచినీళ్లు, ఇంటర్నల్ రోడ్లు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి ఇళ్లు కట్టుకునేవారికి ఇబ్బందులు కలగకుండా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డీఈ. సత్యనారాయణ, తహసీల్దార్ నాగరాజు, ఏఈ రవికుమార్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, కార్యదర్శులు, వీఆర్వోలు పాల్గొన్నారు.