మానసిక ప్రశాంతతోనే పక్షవాత నివారణ
ABN , First Publish Date - 2021-10-26T06:08:43+05:30 IST
మానసిక ప్రశాంతతోనే పక్షవాతాన్ని నివారించగలుగుతామని జేసీ ఏఎస్ దినేష్కుమార్ తెలిపారు.
గుంటూరు(తూర్పు), అక్టోబరు 25: మానసిక ప్రశాంతతోనే పక్షవాతాన్ని నివారించగలుగుతామని జేసీ ఏఎస్ దినేష్కుమార్ తెలిపారు. బ్రెయినసో్ట్రక్ డే పోస్టర్ను సోమవారం శంకరన సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రెయిన సో్ట్రక్ నివారణ మాసోత్సవాల ముగింపు సందర్భంగా 29న నగరంలో 200 కేంద్రాలలో ఉచిత బీపీ పరీక్షలు నిర్వహించి, రక్తపోటుపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో జేసీలు రాజకుమారి, శ్రీధర్రెడ్డి, అనుపమ అంజలి, డీఆర్వో కోండయ్య, ఐఎమ్ఏ అధ్యక్షుడు డాక్టర్ మద్దినేని జగదీష్, రెడ్క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన రామచంద్రరాజు, ఇండియన సో్ట్రక్ అసోసియేషన కౌన్సిల్ సభ్యులు డాక్టర్ విజయ తదితరులు పాల్గొన్నారు.