సమావేశంలో పాల్గొన్న జేసీలు, ఇతర అధికారులు
ABN , First Publish Date - 2020-05-23T08:40:47+05:30 IST
ఇళ్ల స్థలాలకు ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుదారులకు అవసరమైన భూమి సమకూర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని
ఇళ్ల స్థలాల దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
మహారాణిపేట: ఇళ్ల స్థలాలకు ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుదారులకు అవసరమైన భూమి సమకూర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని జాయింట్ కలెక్టర్లు కె.వేణుగోపాల్రెడి,్డ అరుణ్బాబులు తెలిపారు. శుక్రవారం ఆర్డీవోలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఇళ్ల స్థలాలు, రైతుభరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు. పౌరసరఫరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీలు మాట్లాడుతూ రైతుభరోసా కేంద్రాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆర్డీవో పి.కిశోర్, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.