జె బ్రాండ్ మద్యం వల్లే ప్రజల ప్రాణాలు పోతున్నాయి: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-03-17T01:31:14+05:30 IST

జె.టాక్స్ వసూళ్ల కోసం ప్రజల ప్రాణాలను జగన్ రెడ్డి బలిగొంటున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధ్యక్షతన ..

జె బ్రాండ్ మద్యం వల్లే ప్రజల ప్రాణాలు పోతున్నాయి: చంద్రబాబు

అమరావతి: జె.టాక్స్ వసూళ్ల కోసం ప్రజల ప్రాణాలను జగన్ రెడ్డి బలిగొంటున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ శాసనసభ పక్ష సమావేశంలో జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ జే బ్రాండ్ అమ్మకాల వల్ల కల్తీసారా విక్రయం రాష్ట్రంలో పెరిగిపోతోందని మండిపడ్డారు. కల్తీసారాతో పాటు నాసిరకం జె బ్రాండ్ మద్యం వల్లే రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రాణాలు పోతున్నాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. నాటుసారా, జే బ్రాండ్ వ్యవస్థపై ఓ అధ్యయన కమిటీ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. 


Updated Date - 2022-03-17T01:31:14+05:30 IST