తెలంగాణ సాధనలో జయశంకర్ సేవలు చిరస్మరణీయం
ABN , First Publish Date - 2021-06-22T05:59:10+05:30 IST
ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సోమవారం పలు కార్యక్రమాలను నిర్వహించారు. పలుచోట్ల ఆయన ఫొటోలు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సోమవారం పలు కార్యక్రమాలను నిర్వహించారు. పలుచోట్ల ఆయన ఫొటోలు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంత కర్త, జయశంకర్ సార్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సంగారెడ్డి జిల్లాలో..
జహీరాబాద్/వట్పల్లి, జూన్ 21: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆచార్య జయశంకర్ చేసిన కృషి అమోఘమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. సోమవారం జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యేక్యాంపు కార్యాలయంలో ఆచార్యజయశంకర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వట్పల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో జయశంకర్ వర్దంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వట్పల్లి ఏఎంసీ చైర్మన్ రజనీకాంత్, వరం రైతు సొసైటీ అధ్యక్షుడు వీరారెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ బుద్దిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.