TS News: జయశంకర్ భూపాలపల్లిలో గోదావరికి పోటెత్తిన వరద
ABN , First Publish Date - 2022-08-17T15:35:50+05:30 IST
కాళేశ్వరం పుష్కరఘాట్ గోదావరికి వరద పోటెత్తింది. దాదాపు 12.140 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవాహిస్తోంది.
జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం పుష్కరఘాట్ గోదావరి (Godavari)కి వరద పోటెత్తింది. దాదాపు 12.140 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవాహిస్తోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీలోని బ్యారేజీలోని మొత్తం 85 గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 10,07,540 క్యూసెక్కులుగా ఉంది. సరస్వతి (అన్నారం) బ్యారేజీలోని మొత్తం 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 1,07,320 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది.