తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయాలని ఉంది : జయప్రద

ABN , First Publish Date - 2022-05-31T15:56:12+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయాలని ఉంది : జయప్రద

తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయాలని ఉంది : జయప్రద

హైదరాబాద్ సిటీ/హిమాయత్‌నగర్‌ : స్వతహాగా తెలుగు మహిళను (Telugu Women) అయిన తనకు తెలుగు రాష్ట్రాల్లోని (Telugu States) ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని, పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే తాను ఆ దిశగా ముందుకు సాగుతానని బీజేపీ (BJP) నాయకురాలు, మాజీ ఎంపీ జయప్రద అన్నారు. సోమవారం ఆమె హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని ఓ క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ గెలుపునకు పాటుపడతానని చెప్పారు. తెలంగాణ, ఏపీలో అధికారంలో ఉన్న పార్టీలు పాలనను గాలికి వదిలేశాయని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించిన తర్వాతే దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని ఆమె సూచించారు.

Updated Date - 2022-05-31T15:56:12+05:30 IST