జయహో... జగన్మాత
ABN , First Publish Date - 2022-10-04T05:30:00+05:30 IST
దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకో రూపంలో దర్శనమిస్తున్నారు. మంగళవారం కడప అమ్మవారిశాలలో కన్యకాపరమేశ్వరీదేవిగా, విజయదుర్గాదేవి ఆలయంలో సిద్ధిదాత్రి అలంకారంలో భక్తులను కరుణించారు. అలాగే ప్రొద్దుటూరు అమ్మవారిశాలలో, శివాల యంలో గాయత్రిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
కడప/ప్రొద్దుటూరుటౌన్, అక్టోబరు 4: దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకో రూపంలో దర్శనమిస్తున్నారు. మంగళవారం కడప అమ్మవారిశాలలో కన్యకాపరమేశ్వరీదేవిగా, విజయదుర్గాదేవి ఆలయంలో సిద్ధిదాత్రి అలంకారంలో భక్తులను కరుణించారు. అలాగే ప్రొద్దుటూరు అమ్మవారిశాలలో, శివాల యంలో గాయత్రిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే జిల్లాలోని పలు ఆలయాలల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్శించుకున్నారు.