జేఈఈలో భాష్యం జయభేరి
ABN , First Publish Date - 2020-09-20T09:25:39+05:30 IST
జేఈఈలో భాష్యం జయభేరి
గుంటూరు విద్య, సెప్టెంబరు 19: జాతీయ స్థాయిలో విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ ఆర్క్ ఫలితాల్లో భాష్యం ఐఐటి అకాడమి విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని సంస్థ చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. టి.లలిత ఆదిత్య జాతీయ స్థాయి లో 3వ ర్యాంకు సాధించగా, వి.తరుణ్కుమార్ 12, ఎస్.అభిజ్ఞ 14, వికె.విఘ్నే్షచరణ్ 19వ ర్యాంకు సాధిం చారు. 100లోపు 16 ర్యాంకులు, 500లోపు 48 ర్యాంకు లు, 1000లోపు 82 ర్యాంకులు, 5వేలలోపు 284 మంది ర్యాంకులు సాధించారని తెలిపారు. విద్యార్థులను రామకృష్ణ, డైరెక్టర్ హనుమంతరావు అభినందించారు.