బీజేపీ సస్పెండెడ్ నేతకు టీఎంసీ పదవి

ABN , First Publish Date - 2022-03-08T21:42:35+05:30 IST

బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఆ పార్టీ సీనియర్ నేత జై ప్రకాష్ మజుందార్..

బీజేపీ సస్పెండెడ్ నేతకు టీఎంసీ పదవి

కోల్‌కతా: బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఆ పార్టీ సీనియర్ నేత జై ప్రకాష్ మజుందార్ మంగళవారంనాడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొన్న కార్యక్రమంలో ముజుందార్ ఆ పార్టీ తీర్ధం తీసుకున్నారు. పార్టీలో చేరిన కొద్దిసేపటికే ఆయనకు టీఎంసీ రాష్ట్ర కమిటీలో స్థానం కలిపించారు. టీఎంసీ ఉపాధ్యక్షులలో ఒకరిగా ఆయనను ఆ పార్టీ నియమించింది.


బీజేపీకి ఉపాధ్యక్షులుగా వ్యవహరించిన మజుందార్, మరో నేత రితీష్ తివారని కొద్దిరోజుల క్రితం బీజేపీ సస్పెండ్ చేసింది. పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న కారణంగా షోకాజ్ పంపి, ఆ మరుసటి రోజునే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కాగా, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘనవిజయం సాధించడంతో ఎన్నికల ముందు ఆ పార్టీ వీడిన నేతలంతా మళ్లీ టీఎంసీ బాట పట్టారు. వీరిలో కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో, ముకుల్, సవ్యసాచి దత్త, రజీబ్ బెనర్జీ తదితరులు ఉన్నారు.



Updated Date - 2022-03-08T21:42:35+05:30 IST