Chittoor: స్వగ్రామానికి సాయితేజ భౌతికకాయం తరలింపు

ABN , First Publish Date - 2021-12-12T13:27:23+05:30 IST

ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన వీర జవాన్ సాయితేజ భౌతికకాయం బెంగుళూరు ఎయిర్ బేస్ నుంచి 5.45 గంటలకు స్వగ్రామానికి బయలుదేరింది.

Chittoor: స్వగ్రామానికి సాయితేజ భౌతికకాయం తరలింపు

చిత్తూరు: ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన వీర జవాన్ సాయితేజ భౌతికకాయం బెంగుళూరు ఎయిర్ బేస్ నుంచి తెల్లవారుజామున 5:45 గంటలకు స్వగ్రామానికి తరలిస్తున్నారు. కర్ణాటక సరిహద్దులో సాయితేజ మృతదేహానికి ఘన స్వాగతం పలికేందుకు  స్నేహితులు, యువత సన్నాహాలు చేస్తున్నారు. ఊరేగింపు ముందు బైక్ ర్యాలీ ఏర్పాట్లు చేశారు. చీకిలబైలు, వేంపల్లె, చిప్పిలి, మదనపల్లె పట్టణం, అంగళ్లు మీదుగా  28 kms పొడవునా ఊరేగింపుగా స్వగ్రామం ఎగువ రేగడకు సాయితేజ మృతదేహం చేరనుంది. మధ్యాహ్నం సైనిక అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుగనున్నాయి. సాయి తేజ చివరి చూపుల కోసం బంధుమిత్రులు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివస్తున్నారు. 

Updated Date - 2021-12-12T13:27:23+05:30 IST