పుల్వామా ఎన్‌కౌంటర్‌లో గుర్తుతెలియని ఉగ్రవాది హతం

ABN , First Publish Date - 2020-07-07T14:35:00+05:30 IST

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా గుసూ గ్రామంలో మంగళవారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో గుర్తుతెలియని ఉగ్రవాది హతం అయ్యాడు....

పుల్వామా ఎన్‌కౌంటర్‌లో గుర్తుతెలియని ఉగ్రవాది హతం

పుల్వామా (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా గుసూ గ్రామంలో మంగళవారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో గుర్తుతెలియని ఉగ్రవాది హతం అయ్యాడు. పుల్వామా జిల్లా గుసూ గ్రామంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర జమ్మూకశ్మీర్ పోలీసులు, 53 రాష్ట్రీయరైఫిల్స్, సీఆర్ పీఎఫ్ జవాన్లు కలిసి మంగళవారం గాలింపు చేపట్టారు. గుసూ గ్రామంలో దాక్కున్న ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గుర్తుతెలియని ఉగ్రవాది ఒకరు మరణించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక జవాను మరణించారని పోలీసులు చెప్పారు. ఓ జవాన్, పోలీసు కూడా గాయపడ్డారు. ఈ ఎదురుకాల్పుల్లో మరో ముగ్గురు ఉగ్రవాదులు మరణించి ఉంటారని జవాన్లు అనుమానిస్తున్నారు. 

Updated Date - 2020-07-07T14:35:00+05:30 IST