నెహ్రూ స్ఫూర్తి

ABN , First Publish Date - 2020-11-14T06:06:46+05:30 IST

మన మొదటిప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గొప్ప లౌకికవాది, హేతువాది. స్వాతంత్రోద్యమంలో ఆనాడు పాల్గొన్న ఉద్యమకారులెవ్వరూ స్వతంత్రం కోసం ఈనాటి మన నాయకుల్లాగా గు‍ళ్ళ చుట్టూ పొర్లు దండాలుపెట్టలేదు.....

నెహ్రూ స్ఫూర్తి

మన మొదటిప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గొప్ప లౌకికవాది, హేతువాది. స్వాతంత్రోద్యమంలో ఆనాడు పాల్గొన్న ఉద్యమకారులెవ్వరూ స్వతంత్రం కోసం ఈనాటి మన నాయకుల్లాగా గు‍ళ్ళ చుట్టూ పొర్లు దండాలుపెట్టలేదు, యజ్ఞయాగాలు చెయ్యలేదు, బాబాల చుట్టూ తిరగలేదు, రంగురాళ్లు ధరించలేదు, సంఖ్యాశాస్త్రజ్ఞులవద్దకు వెళ్ళలేదు, వాస్తు జ్యోతిష్యాలు నమ్ముకోలేదు. మొక్కవోని పట్టుదలతో తమ జీవితాలను ఫణంగా పెట్టి స్వాతంత్రాన్నిసాధించారు. వారి ఉద్యమస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకుపోవాల్సిన అవసరమెంతైనా వుంది.


నెహ్రు హేతువాది కనుక 1928 లో తను జైలులో ఉండి, పదిసంవత్సరాల తన కూతురు ఇందిరకు కాలదోషంపట్టిన భావాలు, ఆచారాలు, మూఢనమ్మకాలు సమాజానికి ఏరకంగా అవరోధాలో తెలియచేస్తూ, మానవపరిణామం గురించి, దేవుడు, మతము ఏవిధంగా ఏర్పడ్డాయో తన లేఖల్లో వివరించాడు. 1955 లో నాగార్జునసాగర్ శంఖుస్థాపన సమయంలో పూజలు, ముహుర్తాలు, టెంకాయలు కొట్టడాలు ఏమీ లేకుండా జ్యోతి వెలిగించి ఈ అధునిక దేవాలయాన్ని జాతికి అంకితమిస్తున్నాని ప్రకటించాడు. దేశంలో సైన్సు అభివృద్ధి కొరకు ఎంతగానో పాటుపడిన వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ. నేటితరం నాయకులు ఆయన ఆలోచనలను ముందుకు తీసుకొని పోవలసిన అవసరమెంతైనా ఉంది. 


– నార్నెవెంకటసుబ్బయ్య

(నేడు నెహ్రు జయంతి)

Updated Date - 2020-11-14T06:06:46+05:30 IST