బాధిత యువకులకు జవహర్‌ పరామర్శ

ABN , First Publish Date - 2022-01-23T06:25:01+05:30 IST

బాధిత యువకులకు జవహర్‌ పరామర్శ

బాధిత యువకులకు జవహర్‌ పరామర్శ
సంగీత సురేష్‌ను పరామర్శిస్తున్న మాజీ మంత్రి జవహర్‌, మాజీ న్యాయమూర్తి శ్రావణ్‌కుమార్‌

 నిందితులను కఠినంగా శిక్షించాలని గంగినేనిపాలెంలో నిరసన ర్యాలీ 

జి.కొండూరు, జనవరి 22: గంగినేనిపాలెంలో ముగ్గురు దళిత యువకులపై దాడి చేసిన సర్పంచ్‌ పిల్లి రామారావు, ఎంపీటీసీ సభ్యులను పిల్లి ప్రసాద్‌తో పాటు మిగిలిన నిందితులను కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం దాడిలో గాయపడిన సంగీత సురేష్‌తో పాటు మరో ఇద్దరు యువకులను జహహర్‌, మాజీ న్యాయమూర్తి జె.శ్రావణ్‌కుమార్‌ పరామర్శించారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని గ్రామంలో నిరసన ప్రదర్శన చేశారు. బాధితులకు న్యాయం జరగకపోతే పోలీసు ఉన్నతాధికారులపైనా ప్రైవేటు కేసులు పెడతామని హెచ్చరించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జువ్వా రామకృష్ణ, ఉయ్యూరు వెంకట నరసింహారావు, లంక లితీష్‌, దొండపాటి రాము, లంక రామకృష్ణ, మైకు బాబురావు, పజ్జూరు విజయ్‌ పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-01-23T06:25:01+05:30 IST