ప్రజల ఆరోగ్యాలతో జగన్ ప్రభుత్వం చెలగాటం: జవహర్

ABN , First Publish Date - 2021-12-19T19:26:41+05:30 IST

ప్రజల ఆరోగ్యాలతో జగన్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కె ఎస్. జవహర్ అన్నారు.

ప్రజల ఆరోగ్యాలతో జగన్ ప్రభుత్వం చెలగాటం: జవహర్

అమరావతి: ప్రజల ఆరోగ్యాలతో జగన్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కె ఎస్. జవహర్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..జగన్ మద్యపాన నిషేదానికి తూట్లు పొడిచి పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. మద్యపాన నిషేధానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యమన్నారు. గత ప్రభుత్వంలోని నాణ్యమైన బ్రాండ్‌ని తీసుకొస్తానని సీఎం జగన్ చెప్పడం చూస్తే గత ప్రభుత్వ పాలసీనే బెటర్ అని ఒప్పకోవటమేనని అన్నారు.దశలవారీ మద్యపాన నిషేదం పేరుతో మరొక అస్త్రాన్ని తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. ప్రజల బలహీనతల్ని సొమ్ము చేసుకోవటం సబబేనా?అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెద్దఎత్తున పేదలను ప్రోత్సహించి తాగించే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. మద్యం లేకపోతే ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదన్నారు.  ప్రస్తుతం 20 శాతం మద్యం రేట్లు తగ్గిస్తున్నారని, అసలు ఎందుకు పెంచారు? అని కె ఎస్. జవహర్ నిలదీశారు. 

Updated Date - 2021-12-19T19:26:41+05:30 IST