ఇప్పటికైనా ప్రభుత్వం నిజాయితీతో వ్యవహరించాలి: జవహర్
ABN , First Publish Date - 2022-02-04T15:50:52+05:30 IST
ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం నిజాయితీతో వ్యవహరించాలని టీడీపీ నేత జవహర్ అన్నారు.
అమరావతి: ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం నిజాయితీతో వ్యవహరించాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జవహర్ అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఐఏయస్లకు ఐఆర్ అంటే నిజంగా అర్ధం తెలియదా!.. తెలిసీ ఎవరి ప్రయోజనం కోసం వక్రభాష్యం చెపుతున్నారని ప్రశ్నించారు. ఐఆర్ రికవరీ ఎప్పుడైనా జరిగిందా?.. ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయకుండా పీఆర్సీ ఎప్పుడైనా ఇచ్చారా? అని నిలదీశారు. డిఏ ఎప్పుడు కలుపుతారో ఈ సూపర్ ఆఫీసర్లకు తెలియదా? అని ప్రశ్నించారు. సజ్జల తానా అంటే ఐఏఎస్లు తందానా అంటున్నారని విమర్శించారు ఐఏఎస్ ఆధికారులు జగన్కు వకల్తా పుచ్చుకొని చులకనవుతున్నారన్నారు. సీఎస్ నిజాలను దాయాలనుకోవటం శోఛనీయమన్నారు. అధికారులు ఇప్పటికైనా ఆత్మగౌరవంతో వ్యవరించాలని జవహర్ సూచించారు.