విమానం ఎక్కించా.. కల నెరవేర్చుకున్నా!

ABN , First Publish Date - 2021-09-12T06:43:15+05:30 IST

తల్లిదండ్రులను విమానయానం చేయించాలనేది ఒలింపిక్‌ చాంపియన్‌, జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా కల.

విమానం ఎక్కించా.. కల నెరవేర్చుకున్నా!

న్యూఢిల్లీ: తల్లిదండ్రులను విమానయానం చేయించాలనేది ఒలింపిక్‌ చాంపియన్‌, జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా కల. ఇంతకాలానికి అతని కల నెరవేరింది. బళ్లారిలోని ఇన్‌స్పైర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ (ఐఐఎస్‌) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడానికి తన అమ్మానాన్న సరోజ్‌ దేవి, సతీష్‌ కుమార్‌తో కలసి నీరజ్‌ శనివారం విమానంలో ప్రయాణించాడు. ఈ సందర్భంగా.. ‘నా చిన్న కల ఈ రోజు నెరవేరింది. నా తల్లిదండ్రులను తొలిసారి విమానం ఎక్కించా’ అని నీరజ్‌ ట్వీట్‌ చేశాడు. వారితో ఉన్న ఫొటోను కూడా షేర్‌ చేశాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో నీరజ్‌ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2021-09-12T06:43:15+05:30 IST