రవికిరణ్కు జావెలిన్ స్వర్ణం
ABN , First Publish Date - 2022-05-21T09:33:09+05:30 IST
పారి్సలో జరిగిన ప్రపంచ స్కూల్ గేమ్స్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విద్యార్థులు సత్తా చాటారు.
ప్రపంచ స్కూల్ గేమ్స్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): పారి్సలో జరిగిన ప్రపంచ స్కూల్ గేమ్స్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విద్యార్థులు సత్తా చాటారు. సాంఘిక సంక్షేమ గురుకులం షేక్పేట్ స్పోర్ట్స్ అకాడమీకి చెందిన రవికిరణ్ జావెలిన్ త్రోలో బంగారు పతకం (30.74 మీ.) సాధించాడు. డిండి స్పోర్ట్స్ అకాడమీకి చెందిన మాయావతి 200 మీ. పరుగులో కాంస్య పతకం (24.68 సె.) కైవసం చేసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటడం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ చరిత్రలో ఇదే మొదటిసారి. పతకాలు అందుకున్న విద్యార్థులను గురుకుల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్ రోస్ అభినందించారు.