జవాన్ మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2020-05-30T10:30:32+05:30 IST
మండలంలోని కె.ఎ్స.పల్లికి చెందిన ఆర్మీ జవాన్ సంగిరెడ్డి సంజీవరెడ్డి(28) మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది.
గిద్దలూరు, మే 29 : మండలంలోని కె.ఎ్స.పల్లికి చెందిన ఆర్మీ జవాన్ సంగిరెడ్డి సంజీవరెడ్డి(28) మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. సంజీవరెడ్డి సిక్కిం రాష్ట్రంలో విధులు నిర్వహిస్తుండగా అతను డ్రైవింగ్ చేస్తున్న వాహనం లోయలోపడి మంచు లో కూరుకుపోయింది. ఆ లోయ ను 48 రోజులుగా ఆర్మీ ఉద్యోగులు జల్లెడ పట్టగా ఎట్టకేలకు శుక్రవారం సంజీవరెడ్డి మృతదేహాన్ని గుర్తించారు. ఆ విషయా న్ని మృతుని కుటుంబసభ్యులకు తెలిపారు. మృతదేహాన్ని గిద్దలూరుకు తరలించేందుకు ఆర్మీ అధికారులు ఏర్పాట్లు చేశారు. శనివారానికి మృతదేహం సొంత గ్రా మానికి వస్తుందని భావిస్తున్నా రు. మృతుడు సంజీవరెడ్డి భార్య గర్భిణి. విషయం తెలిసిన దగ్గర్నుంచీ ఆమె విలపిస్తూనే ఉంది.