గుండెపోటుతో జవాన్‌ మృతి

ABN , First Publish Date - 2022-05-23T04:59:53+05:30 IST

మండలంలోని నల్లపాళెం గ్రామానికి చెందిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ బయ్యా ప్రసాద్‌(37) గుండెపోటుతో మృతిచెందాడు.

గుండెపోటుతో జవాన్‌ మృతి
జవాన్‌ ప్రసాద్‌ (ఫైల్‌ )

 నల్లపాళెంలో విషాదం

పొదలకూరు రూరల్‌, మే 22 : మండలంలోని నల్లపాళెం గ్రామానికి చెందిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ బయ్యా ప్రసాద్‌(37) గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన బయ్యా ప్రసాద్‌(37) 15 ఏళ్లుగా సీఆర్‌పీఎ్‌ఫలో వివిధ రాష్ట్రాల్లో పని చేస్తున్నాడు. ప్రస్తుతం ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం నిద్రలేచి వాకింగ్‌కి వెళ్లి వచ్చి గుండెల్లో నొప్పిగా ఉందని పడుకున్నాడు. 11గంటలకు నిద్రలేచి నొప్పి ఎక్కువగా ఉందని భార్యకు చెప్పడంతో ప్రసాద్‌ను వైద్యశాలకు తరలించారు. డాక్టర్లు పరీక్షించి ప్రసాద్‌ అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో ఆదివారం మృతదేహాన్ని స్వగ్రామం  నల్లపాళెం తరలించి, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - 2022-05-23T04:59:53+05:30 IST