రామచంద్రరావు గెలుపు ఖాయం : జావడేకర్

ABN , First Publish Date - 2021-02-28T01:09:54+05:30 IST

బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావును చూసి టీఆర్ఎస్ నాయకులు భయపడుతున్నారని కేంద్రమంత్రి ప్రకాష్ జావడేకర్ ఎద్దేవా చేశారు.

రామచంద్రరావు గెలుపు ఖాయం : జావడేకర్

హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావును చూసి టీఆర్ఎస్ నాయకులు భయపడుతున్నారని కేంద్రమంత్రి ప్రకాష్  జావడేకర్ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ లాంటి కుటుంబ పార్టీలతో లాభం లేదని చెప్పారు.రామచంద్రరావు గెలుపు ఖాయమని అధికార పార్టీకి అర్థమైందని..  రామచంద్రరావుపై టీఆర్ఎస్ నేతల వ్యక్తిగత  విమర్శలే ఇందుకు నిదర్శనమన్నారు.గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీకి వచ్చిన ఓట్లు దాదాపు సమానమని చెప్పారు.ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రత్యేకమైనవి.‌ ప్రతి ఓటర్‌ను పోలింగ్ స్టేషన్‌కు తీసుకురావాలన్నారు.పేదలను వృద్ధిలోకి తీసుకురావటమే బీజేపీ లక్ష్యమన్నారు. అంతర్జాతీయ పరిస్థితుల వల్లే ప్రెటోల్ ధరల పెరుగుదలకు కారణమని చెప్పారు.త్వరలో ప్రెట్రోల్ ధరలు తగ్గుముఖం పడుతాయని ప్రకాష్ జావడేకర్ పేర్కొన్నారు.

Updated Date - 2021-02-28T01:09:54+05:30 IST