రైతుల్లో కలవరం

ABN , First Publish Date - 2021-12-05T05:34:30+05:30 IST

పిఠాపురం, డిసెంబరు 4: జవాద్‌ తుపాన్‌ నేపథ్యంలో రైతులు కలవరానికి గురవుతున్నారు. అప్పుడప్పుడు చిరుజల్లులు పడుతుండడంతో పొలాల్లో ఉండిపోయిన పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాలతో పాటు మండలాల్లోని గ్రామాల్లో ప్ర

రైతుల్లో కలవరం
పిఠాపురంలో వరిపనలను ఒబ్బిడి చేసుకుంటున్న రైతులు

తుపాన్‌ హెచ్చరికలతో హడావుడిగా మాసూళ్లు

పిఠాపురం, డిసెంబరు 4: జవాద్‌ తుపాన్‌ నేపథ్యంలో రైతులు కలవరానికి గురవుతున్నారు. అప్పుడప్పుడు చిరుజల్లులు పడుతుండడంతో పొలాల్లో ఉండిపోయిన పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాలతో పాటు మండలాల్లోని గ్రామాల్లో ప్రస్తుతం వరి కోతలు ముమ్మరంగా సాగుతూ పొలాల్లోనే వరిపనలు ఉండిపోయాయి. తుపాన్‌ హెచ్చరికలతో సరిగా ఆరకున్నా వాటిని కుప్పలు వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్డు పక్కనే మిషన్ల సాయంతో మాసూళ్లు పూర్తి చేసి ధాన్యాన్ని విక్రయించడం లేదా ఇళ్లకు తరలిస్తున్నారు. వర్షం బారిన పడకుండా రైతులు పంటను కాపాడుకోవాలని తాపత్రయపడుతుండగా కూలీలు దొరకక ఇబ్బందులు పడుతూ  ఉన్నవారినే సర్దుబాటు చేసుకుంటూ పనులు నిర్వహించారు. 


Updated Date - 2021-12-05T05:34:30+05:30 IST