జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ జట్టుకు సౌమ్య ఎంపిక

ABN , First Publish Date - 2022-05-26T03:44:15+05:30 IST

స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బండ్ల సౌమ్య జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్‌ జూనియర్‌ బాలికల జట్టుకు

జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ జట్టుకు సౌమ్య ఎంపిక
బండ్ల సౌమ్య

సంగం, మే 25: స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బండ్ల సౌమ్య జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్‌ జూనియర్‌ బాలికల జట్టుకు ఎంపికైంది.  ఈ నెల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పంజాబ్‌లోని చండీఘర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లింది. ఇటీవల రాష్ట్రస్థాయిలో గుంటూరు జిల్లా వినుకొండలో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరచడంతో జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్‌ జూనియర్‌ బాలికల జట్టుకు  సౌమ్యను ఎంపిక చేసినట్లు ప్రధానోపాధ్యాయుడు మాల్యాద్రి తెలిపారు.  జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యేందుకు శిక్షణ ఇచ్చిన  పీడీ మధుసూదన్‌రావు, జిల్లా సాఫ్ట్‌బాల్‌ ప్రెసిడెంట్‌ ఎం కోటారెడ్డి, సెక్రటరీ సీహెచ్‌ కామేశ్వరిలను  ప్రధానోపాధ్యాయుడు మాల్యాద్రి, ఉపాధ్యాయులు అభినందించారు. 


Updated Date - 2022-05-26T03:44:15+05:30 IST