జశ్వంత్‌సింగ్‌ మృతి వార్త నన్ను ఎంతో కలిచివేసింది: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-09-27T23:07:54+05:30 IST

కేంద్ర మాజీమంత్రి జశ్వంత్‌సింగ్‌ మృతి వార్త తనను ఎంతో కలిచివేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జశ్వంత్‌సింగ్‌ మృతిపై ఆయన సంతాపం తెలిపారు.

జశ్వంత్‌సింగ్‌ మృతి వార్త నన్ను ఎంతో కలిచివేసింది: చంద్రబాబు

అమరావతి: కేంద్ర మాజీమంత్రి జశ్వంత్‌సింగ్‌ మృతి వార్త తనను ఎంతో కలిచివేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జశ్వంత్‌సింగ్‌ మృతిపై ఆయన సంతాపం తెలిపారు. ఎల్లప్పుడూ వినయంగా వ్యవహరించే జశ్వంత్‌సింగ్‌.. దేశానికి ఎనలేని సేవలు అందించారని చంద్రబాబు గుర్తుచేశారు. ఆదివారం జశ్వంత్‌సింగ్‌ కన్నుమూశారు. జశ్వంత్‌సింగ్‌ మృతిపట్ల ప్రధాని మోదీ, రాజ్‌నాథ్‌ సింగ్‌ సంతాపం తెలిపారు. 1938, జనవరి 3న రాజస్థాన్‌లో జశ్వంత్‌సింగ్‌  జన్మించారు. ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రక్షణశాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. 1980, 1986, 1998, 1999, 2004లో రాజ్యసభకు, 1990, 1991, 1996, 2009లో లోక్‌సభకు  జశ్వంత్‌సింగ్‌ ఎన్నికయ్యారు. 

Updated Date - 2020-09-27T23:07:54+05:30 IST