జాషువా స్ఫూర్తితో నడుచుకోవాలి

ABN , First Publish Date - 2021-09-29T04:42:03+05:30 IST

అణగారిన వర్గాల అభ్యు న్నతి కోసం గుర్రం జాషువా చేసిన కృషి అభినంద నీయమని ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ పేర్కొ న్నారు.

జాషువా స్ఫూర్తితో నడుచుకోవాలి
మాట్లాడుతున్న డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి

కనిగిరి, సెప్టెంబరు 28: అణగారిన వర్గాల అభ్యు న్నతి కోసం గుర్రం జాషువా చేసిన కృషి అభినంద నీయమని ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ పేర్కొ న్నారు. స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ ఎదురుగా ఉ న్న జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చై ర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌, వైస్‌ చైర్మన్‌ పులి శాంతి, జడ్పీటీసీలు మడతల కస్తూరిరెడ్డి, దద్దాల నారాయ ణ యాదవ్‌, వైసీపీ నాయకులు రంగనాయకులరెడ్డి, సూరసాని మోహన్‌రెడ్డి, చింతం శ్రీనివాసులు యా దవ్‌, కటికల వెంకటరత్నం, రహీం, కౌన్సిలర్లు దేవకి రాజీవ్‌, రామనబోయిన శ్రీనివాసులు యాదవ్‌, సంగు సుబ్బారెడ్డి, రామన సతీష్‌, ఎమ్మార్పీఎస్‌ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

జాషువా రచనలు సమాజానికి ఆదర్శం

దర్శి, సెప్టెంబరు 28: మహాకవి గుర్రం జాషువా రచనలు సమాజానికి ఆదర్శంగా నిలిచాయని దర్శి డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర దళితసేనా, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం దర్శిలో గుర్రం జాషువా 126వ జయంతి వేడుకలను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొ న్న డీఎస్పీ మాట్లాడుతూ అంటరానితనం, కులవివక్షత నిర్మూలనకు జాషువా తన రచనల ద్వారా సమాజంలో చైతన్యం తెచ్చారన్నారు.  

కార్యక్రమంలో ఎంఈవో కె.రఘురామయ్య, సంఘసేవకుడు జీవి రత్నం, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.బ్రహ్మయ్య, పాస్లర్ల సంఘం అధ్యక్షుడు కృపానందం, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.కరుణానిధి, కోరె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-29T04:42:03+05:30 IST