కరోనా ఎఫక్ట్: ప్రజలకు కీలక సూచనలు జారీ చేసిన జపాన్

ABN , First Publish Date - 2020-04-01T04:04:37+05:30 IST

కరోనాతో సతమతమవుతున్న 73 దేశాలు, ప్రాంతాలకు వెళ్లద్దంటూ ప్రజలకు సూచించింది. అంటే.. ప్రపంచంలో మూడో వంతు ప్రాంతాలకు దూరంగా ఉండాలని చెప్పకనే చెప్పింది.

కరోనా ఎఫక్ట్: ప్రజలకు కీలక సూచనలు జారీ చేసిన జపాన్

టోక్యో: ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా.. జాపాన్‌లో ఇంకా తన విలయతాండవాన్ని ప్రారంభించలేదు. అయితే ఇప్పుడిప్పుడే అక్కడ కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో పరిస్థితి చేయిదాటే లోపే అక్కడి ప్రభుత్వం రంగంలోకి దిగింది. కరోనాతో సతమతమవుతున్న 73 దేశాలు, ప్రాంతాలకు వెళ్లద్దంటూ ప్రజలకు సూచించింది. అంటే.. ప్రపంచంలో మూడో వంతు ప్రాంతాలకు దూరంగా ఉండాలని చెప్పకనే చెప్పింది. ఇక రాబోయే కాలంలో వీదేశీయులను జపాన్‌లోకి అడుగు పెట్టకుండా చేసేందుకు కూడా జపాన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2020-04-01T04:04:37+05:30 IST