మూడు విడతల్లో జన్ధన్ నిధుల జమ: ఎల్డీఎం
ABN , First Publish Date - 2020-04-09T12:19:09+05:30 IST
జన్ధన్ కింద లబ్ధి పొందుతున్న మహిళల ఖాతాలకు మూడు విడతల్లో రూ.500 వంతున జమ చేయనున్నట్లు ఎల్డీఎం
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 8: జన్ధన్ కింద లబ్ధి పొందుతున్న మహిళల ఖాతాలకు మూడు విడతల్లో రూ.500 వంతున జమ చేయనున్నట్లు ఎల్డీఎం గణపతి తెలిపారు. జిల్లాలో 3,93,595 మహిళలకు ఈ పథకం కింద లబ్ధి చేకూరుతుందని చెప్పారు.
గురువారం నాటికి తొలివిడతగా రూ.500 జమ చేస్తామనీ, మే, జూన్లో మిగిలిన రూ.వెయ్యి అందజేయనున్నట్లు పేర్కొన్నారు. దీనిపై అవగాహన లేక లబ్ధిదారులు బ్యాంకు మేనేజర్లతో వాగ్వాదానికి దిగడంపై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. లబ్ధిదారులు రూపే కార్డు సాయంతో ఏటీఎంల నుంచి నగదు డ్రా చేసుకోవచ్చనీ, బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా కూడా పొందవచ్చని సూచించారు.