జంగారెడ్డిగూడెం సారా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-03-14T21:23:55+05:30 IST

జంగారెడ్డిగూడెం సారా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని టీడీపీ నేత చంద్రబాబు స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం

జంగారెడ్డిగూడెం సారా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే: చంద్రబాబు

అమరావతి: జంగారెడ్డిగూడెం సారా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని టీడీపీ నేత చంద్రబాబు స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం సహజ మరణాలనడం సిగ్గుచేటన్నారు. 26 మంది చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మద్యపాన నిషేధమంటూ సొంత బ్రాండ్లు తెచ్చారని ఆరోపించారు. నాటుసారా వ్యాపారం చేస్తున్నది వైసీపీ నేతలేనని చెప్పారు. తాను ప్రజాహితం కోసమే పనిచేస్తానని తెలిపారు. నాటుసారా దొంగలను పట్టించి కేసులు పెట్టేవరకు ఊరుకోనని హెచ్చరించారు. 26 కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం ఇస్తామని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు 25 లక్షల రూపాయలు చొప్పున పరిహారం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాసిరకం బ్రాండ్లు తెచ్చి రేట్లు పెంచడం వల్లే.. పేదలు నాటుసారా తాగే పరిస్థితి వచ్చిందన్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే.. ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం ఇస్తామని చంద్రబాబు తెలిపారు.

Updated Date - 2022-03-14T21:23:55+05:30 IST