దుబాయ్‌లో జంగపల్లి గల్ఫ్‌ కార్మికుల నిరసన

ABN , First Publish Date - 2020-12-03T05:42:03+05:30 IST

గల్ఫ్‌లో జీవనం సాగిస్తున్న వలస కార్మికులు అందరూ కలిసి జంగపల్లి గల్ఫ్‌ సేవాసమితి స్థాపించి బుధవారం దుబాయ్‌ లోని అజ్మాన్‌ ప్రాంతంలో తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ పాలసీ సాధనకై సమావేశమ య్యారు.

దుబాయ్‌లో జంగపల్లి గల్ఫ్‌ కార్మికుల నిరసన
దుబాయ్‌లో జంగపల్లి వాసుల నిరసన

గన్నేరువరం, డిసెంబరు 2: గల్ఫ్‌లో జీవనం సాగిస్తున్న వలస కార్మికులు అందరూ కలిసి జంగపల్లి గల్ఫ్‌ సేవాసమితి స్థాపించి బుధవారం దుబాయ్‌ లోని అజ్మాన్‌ ప్రాంతంలో తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ పాలసీ సాధనకై సమావేశమ య్యారు. రాబోయే అసెంబ్లీ సమావే శాలలో రూ.500కోట్ల బడ్జెట్‌తో తెలం గాణ గల్ఫ్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి చట్టబద్దత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ప్లకార్డులతో నిరసన చేపట్టినట్లు జంగపల్లి గల్ఫ్‌ సేవాసమితి అధ్య క్షుడు గుంటుక లక్ష్మీపతి తెలిపారు. కార్యక్రమంలో జంగపల్లి గల్ఫ్‌ సేవాస మితి గౌరవ అధ్యక్షుడు జక్కని రామాంజనేయులు, ఉపాధ్య క్షుడు గుంటుక చరణ్‌,సుద్దాల సురేష్‌,రంగు రమేష్‌,సాయి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-03T05:42:03+05:30 IST