Telangana: జనగామలో వ్యక్తి అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2022-02-23T16:46:15+05:30 IST

జిల్లాలోని ఎర్రగొల్లపహాడ్ సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు.

Telangana: జనగామలో వ్యక్తి అనుమానాస్పద మృతి

జనగామ: జిల్లాలోని ఎర్రగొల్లపహాడ్ సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. మృతుడు తరిగొప్పులకు చెందిన రియల్టర్ కొండా అనిల్‌గా గుర్తించారు. హైదరాబాద్ అంబర్ పేట శంకర్‌కు అనిల్‌ రైట్ హ్యాండ్ అని సమాచారం. మృతుడి వాహనంపై ఎమ్మెల్యే ప్రోటోకాల్ స్టిక్కర్ ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-02-23T16:46:15+05:30 IST