జనగామలో దారుణం

ABN , First Publish Date - 2022-04-11T18:41:47+05:30 IST

జిల్లాలోని జఫర్గడ్ మండలం ఉప్పుగల్లులో దారుణం జరిగింది.

జనగామలో దారుణం

జనగామ: జిల్లాలోని జఫర్గడ్ మండలం ఉప్పుగల్లులో దారుణం జరిగింది. పాత గొడవలతో కేశోజు రాజేష్ అనే యువకుడి ఇంటిపై 15 మంది దాడి చేశారు. ఇంటి తలుపులు, బైక్, ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న డబ్బా ధ్వంసం చేశారు. ఫైనాన్స్ కోసం తీసుకొచ్చిన డబ్బులు ఎత్తుకెళ్లారని బాధితులు ఆరోపించారు. గతంలో సిగరెట్ విషయంలో వివాదం తలెత్తిందని, దాన్ని మనసులో పెట్టుకుని గొడవ చేశారని పోలీసులు చెబుతున్నారు. గతంలో వీరిపై కేసులు నమోదు అయినట్లు చెప్పారు.  బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 15 మందిపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2022-04-11T18:41:47+05:30 IST