21న తిరుపతిలో ‘జనవాణి’

ABN , First Publish Date - 2022-08-19T06:23:53+05:30 IST

ప్రజా సమస్యలను పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా జనసేనాని పవన్‌కల్యాణ్‌ చేపట్టిన ‘జనవాణి’ కార్యక్రమం ఈనెల 21న తిరుపతిలో జరగనుందని ఆ పార్టీ జిల్లా ఇన్‌చార్జి పి.హరిప్రసాద్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు

21న తిరుపతిలో ‘జనవాణి’


రాయలసీమ, నెల్లూరు జిల్లాల సమస్యలపై వినతులు స్వీకరించనున్న పవన్‌కల్యాణ్‌


తిరుపతి(కొర్లగుంట), ఆగస్టు 18: ప్రజా సమస్యలను పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా జనసేనాని పవన్‌కల్యాణ్‌  చేపట్టిన ‘జనవాణి’ కార్యక్రమం ఈనెల 21న తిరుపతిలో జరగనుందని ఆ పార్టీ జిల్లా ఇన్‌చార్జి పి.హరిప్రసాద్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తిరుచానూరు బైపాస్‌ రోడ్డులోని బాలాజీ డెయిరీకి ఎదురుగా వున్న జీఆర్‌.ఆర్‌ కన్వెన్షన్‌ హాల్లో ఆదివారం ఉదయం 10గంటలకు జనవాణి కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. రాయలసీమలోని ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలతో పాటు నెల్లూరు ఉమ్మడి జిల్లా నుంచి కూడా ప్రజలు తమ సమస్యలను పవన్‌కల్యాణ్‌ దృష్టికి తీసుకురావచ్చన్నారు.ప్రజలు తమ సమస్యలపై అందించే వినతులను  పవన్‌కల్యాణ్‌ స్వీకరిస్తారు  కావున ఈ అవకాశాన్ని బాధిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.ప్రజల నుంచి స్వీకరించిన వినతులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆయాశాఖల వారీగా పరిష్కరించేందుకు జనసేన పార్టీ తరపున ప్రత్యేక బృందం కృషి చేస్తోందని హరిప్రసాద్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-19T06:23:53+05:30 IST