కోనసీమ కార్చిచ్చు వైసీపీ కుట్రలో భాగమే

ABN , First Publish Date - 2022-05-26T05:49:07+05:30 IST

కోనసీమ జిల్లా పేరు విషయాన్ని వివాదాస్పదం చేసి, కార్చిచ్చును రాజేయటం వైసీపీ రాజకీయ కుట్రలో భాగమేనని జనసేనపార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు అన్నారు.

కోనసీమ కార్చిచ్చు వైసీపీ కుట్రలో భాగమే
సమావేశంలో మాట్లాడుతున్న గాదె వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు

జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు

గుంటూరు(తూర్పు), మే 25: కోనసీమ జిల్లా పేరు విషయాన్ని వివాదాస్పదం చేసి, కార్చిచ్చును రాజేయటం వైసీపీ రాజకీయ కుట్రలో భాగమేనని జనసేనపార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు అన్నారు. బుధవారం ఆయన జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కోనసీమ జిల్లా పేరు మార్పు విషయంపై అమలా పురంలో జరిగిన అల్లర్లలో జనసేన ప్రమేయం ఉందని వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు వారి దిగజారుడుతనానిని నిదర్శనమ న్నారు. అన్ని జిల్లాలకు పేరుపెట్టినట్టే కోనసీమకు అనాడే అంబేద్కర్‌ పేరు పెట్టుంటే నేడు ఈ అల్లర్లు జరిగేవి కాదన్నారు. దళితులను  దగ్గరకు చేర్చుకునేందుకే కోనసీమ జిల్లా పేరు మార్పు అంశాన్ని వైసీపీ తెరపైకి తెచ్చిందన్నారు. కార్యక్రమంలో జనసేన మైనార్టీ నాయకులు షేక్‌ నాయబ్‌కమల్‌ జనసేన నాయకులు ఆళ్ళహరి, మాణిక్యలరావు, ప్రసాదు,రాజేష్‌, ముధులాల్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-26T05:49:07+05:30 IST