సమస్యల పరిష్కారానికి ఉద్యమం
ABN , First Publish Date - 2021-07-30T06:27:29+05:30 IST
స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రజల పక్షాన పోరాడేందుకు పోరాటాలకు సిద్ధంగా ఉన్నట్లు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన
గుంటూరు (మెడికల్) జూలై 29: స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రజల పక్షాన పోరాడేందుకు పోరాటాలకు సిద్ధంగా ఉన్నట్లు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ద్వజమెత్తారు. జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలు పడుతున్న బాధలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. సమావేశంలో జనసేన కార్పొరేటర్లు దాసరి లక్ష్మి, యర్రంశెట్టి పద్మావతి, నాయకులు ఆళ్ల హరి, నక్కల వంశీ, విజయలక్ష్మీ, రజని, దాసరి వెంకటేశ్వర్లు, కొప్పుల కిరణ్, చేజర్ల శివకుమార్, మల్లిక, పద్మావతి, వాసు, శిఖ బాలు తదితరులు పాల్గొన్నారు.