వేధింపులతోనే వెంగయ్య ఆత్మహత్య: నాదెండ్ల మనోహర్

ABN , First Publish Date - 2021-01-20T02:12:56+05:30 IST

గ్రామంలో అభివృద్ధి జరగాలని చూసిన జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు గొంతు నొక్కేశారని ఆ పార్టీ పీఎసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు

వేధింపులతోనే వెంగయ్య ఆత్మహత్య: నాదెండ్ల మనోహర్

అమరావతి: గ్రామంలో అభివృద్ధి జరగాలని చూసిన జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు గొంతు నొక్కేశారని ఆ పార్టీ పీఎసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు, స్థానిక వైసీపీ నేతల వేధింపులతోనే వెంగయ్య ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. వెంగయ్య కుటుంబానికి జనసేన పార్టీ రూ.5 లక్షల ఆర్థిక సాయం పవన్ ప్రకటించారని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు చూస్తుంటే సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉన్నాయని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు జరగడంపై ప్రతి ఒక్కరు ప్రశ్నించాలని కోరారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో దౌర్జన్యాలకు పాల్పడిందని విమర్శించారు. ఇలాంటి చర్యలను జనసేన పార్టీ ఖండిస్తోందన్నారు. ఏ పార్టీ కూడా ఎల్లప్పుడూ అధికారంలో ఉండదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

Updated Date - 2021-01-20T02:12:56+05:30 IST