వైసీపీ అరాచకాలతో విసిగిపోయిన ప్రజలు : జనసేన

ABN , First Publish Date - 2022-08-10T04:09:38+05:30 IST

: వైసీపీ అరాచకాలతో ప్రజలు విసిగిపోయారని, కావలి ప్రజలు ప్రతా్‌పకుమార్‌ రెడ్డిని రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన అనుచరులు దోచుకోవడానికి తప్ప కావలిలో అభివృద్ధికి సహకరించడం లేదని జనసేన నాయకులు దుయ్యబట్టారు.

వైసీపీ అరాచకాలతో విసిగిపోయిన ప్రజలు : జనసేన
మాట్లాడుతున్న జనసేన నేతలు

కావలి, ఆగస్టు 9 : వైసీపీ అరాచకాలతో ప్రజలు విసిగిపోయారని, కావలి ప్రజలు  ప్రతా్‌పకుమార్‌ రెడ్డిని రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన అనుచరులు దోచుకోవడానికి తప్ప కావలిలో అభివృద్ధికి సహకరించడం లేదని జనసేన నాయకులు దుయ్యబట్టారు. స్థానిక జర్నలి్‌స్టక్లబ్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో జనసేన జిల్లా కార్యదర్శి సమ్మెన వెంకటసుబ్బయ్య, నియోజకవర్గ అధికార ప్రతినిధి మన్నేపల్లి రుషికేష్‌, గౌరవ సలహాదారుడు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు పొబ్బా సాయివిఠల్‌ మాట్లాడారు. ప్రజాసేవ కోసం రూ.కోట్ల సంపాదన వదులుకుని రాజకీయాల్లోకి వచ్చి తాను సంపాదించిన డబ్బుతో పవన్‌ కల్యాణ్‌ సేవ చేస్తున్నారన్నారు. పార్టీ కోసం సొంత డబ్బులతో కారులు కొనుగోలు చేసిన పవన్‌కల్యాణ్‌ను విమర్శించిన ఆర్‌కే రోజా మంత్రి కాగానే ఖరీదైన కారును కొడుకుకు గిప్ట్‌గా ఎలా ఇచ్చారో చెప్పాలన్నారు. గడపగడపలో ప్రజలు ఎమ్మెల్యేను నిదీస్తుంటే ప్రజాప్రతినిధిగా సమాధానం చెప్పకుండా తాట తీస్తామని బెదిరించడం సిగ్గుచేటన్నారు. వైసీపీ అరాచక పాలనకు ప్రజలు విసిగి పోయి ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఈ సమావేశంలో జనసేన నేతలు ఫణికుమార్‌, ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T04:09:38+05:30 IST