దళితులను మోసం చేస్తున్న వైసీపీ

ABN , First Publish Date - 2022-05-29T06:10:21+05:30 IST

దళిత బిడ్డలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్న వైసీపీ నేతలు సామాజిక న్యాయ భేరి యాత్ర పేరుతో మరోసారి దళితులను మోసం చేయాలని చూస్తున్నారని జనసేన పార్టీకి చెందిన దళిత నాయకులు ధ్వజమెత్తారు.

దళితులను మోసం చేస్తున్న వైసీపీ
మాట్లాడుతున్న జనసేన పార్టీ దళిత నాయకలు

జనసేన పార్టీ దళిత నాయకులు

గుంటూరు, మే 28: దళిత బిడ్డలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్న వైసీపీ నేతలు సామాజిక న్యాయ భేరి యాత్ర పేరుతో మరోసారి దళితులను మోసం చేయాలని చూస్తున్నారని జనసేన పార్టీకి చెందిన దళిత నాయకులు ధ్వజమెత్తారు. శనివారం లాడ్జి సెంటర్‌లో పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, దళిత నాయకులు పెదపూడి విజయకుమార్‌, రాష్ట్ర కార్యదర్శి, దళిత నాయకులు బేతపూడి విజయ్‌శేఖర్‌, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాకనాటి గౌతమ్‌ రాజ్‌ తదితరులు మాట్లాడారు.  అంబేద్కర్‌ పేరుతో దళితులను దగ్గర చేర్చుకొనే ప్రయత్నంలో పచ్చని కోనసీమలో కుల కార్చిచ్చు రగిల్చారని జనసేన నేతలు ఆరోపించారు. అధికారం కాపాడుకోవడం కోసం వైసీపీ ఎంతటి దుర్మార్గానికైనా తెగిస్తుందని కోనసీమ సంఘటన నిరూపించినట్లు వారు పేర్కొన్నారు. సమావేశంలో కొప్పుల కిరణ్‌, కొండూరి కిషోర్‌, కొర్రపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-29T06:10:21+05:30 IST