Janasena leaders fire on roja: మేము పిల్ల వెధవలం అయితే... రోజా అవ్వానా
ABN , First Publish Date - 2022-08-08T18:02:16+05:30 IST
జనసేన కార్యకర్తలను పిల్ల వెధవలంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతి: జనసేన కార్యకర్తల (Janasena activists)ను పిల్ల వెధవలంటూ మంత్రి రోజా (Roja) చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘మేము పిల్ల వెధవలం అయితే... రోజా అవ్వనా’’ అంటూ ఆ పార్టీ నేత కిరణ్ రాయల్ (Kiran rayol) మండిపడ్డారు. అవ్వ కాబట్టే ప్రెస్ క్లబ్లో అందరి ముందు మేకప్ వేసుకున్నారని అన్నారు. రోజా (Mister roja) కంటే ఎక్కువ చదివిన వారు, మూడు బెంజి కార్లున్న వారు జనసేన కార్యకర్తలున్నారని తెలిపారు. ఈ పిల్ల వెధవలే రాబోయే రోజుల్లో రాజకీయాలను శాశించబోయేదని స్పష్టం చేశారు. జనసేన కార్యకర్తలకు రోజా (Roja comments) క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే పిల్లవెధవల్లా పిల్ల చేష్టలు చేస్తామని... ఎక్కడబడితే అక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. లేదా ఇకపై రోజా అవ్వా అని పిలుస్తామన్నారు. అవినీతి డబ్బుతో రోజా బెంజికారు కొనలేదని నిరుపించుకోవటానికి... మంత్రి అవకముందు ఐ.టి రిటర్నులు, మంత్రి అయ్యాక ఐ.టి. రిటర్నులను రోజా బయటపెట్టాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు.