వెంకయ్య కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి: పవన్
ABN , First Publish Date - 2020-09-30T17:58:08+05:30 IST
కరోనా బారిన పడి హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.
అమరావతి: కరోనా బారిన పడి హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘మన భారత దేశ - ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుగారు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆ ఏడుకొండల వాడిని కోరుకుంటున్నాను’’ అంటూ పవన్ ట్వీట్ చేశారు.
మంగళవారం రొటీన్గా నిర్వహించిన పరీక్షల్లో వెంకయ్యకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అయితే వెంకయ్యకు కరోనా సోకినా లక్షణాలేవీ కనిపించలేదని, ఆయన మంచి ఆరోగ్యంతో ఉన్నారని ఉపరాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. హోం ఐసోలేషన్లో ఉండాల్సిందిగా వైద్యులు ఆయనకు సూచించారు. వెంకయ్య నాయుడుకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలియగానే ప్రధాని మోదీ ఆయనకు ఫోన్ చేసి, ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.