21న తిరుపతికి పవన్ కళ్యాణ్
ABN , First Publish Date - 2021-01-15T19:31:13+05:30 IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 21న తిరుపతిలో పర్యటించను
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 21న తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. 21న సాయంత్రం నగరంలో నిర్వహించనున్న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ)లో పవన్ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పవన్తో పాటు రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొంటారు. పలు ముఖ్యమైన అంశాలపై సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.