అన్నా రాంబాబు గుర్తుంచుకో నిన్ను...: పవన్

ABN , First Publish Date - 2021-01-23T17:11:50+05:30 IST

వైసీపీ ఎమ్మెల్యే రాంబాబుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ఒంగోలులో జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు కుటుంబాన్ని పవన్ పరామర్శించారు.

అన్నా రాంబాబు గుర్తుంచుకో నిన్ను...: పవన్

ప్రకాశం: వైసీపీ ఎమ్మెల్యే రాంబాబుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ఒంగోలులో జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు కుటుంబాన్ని పవన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏం తప్పుచేసాడని వెంగయ్య ప్రాణాలు కోల్పోయాడని ప్రశ్నించారు. గ్రామ సమస్యపై ఎమ్మెల్యేని అడిగినందుకు ఆయన మాటలకు మానసిక వేదనకు గురయ్యాడని.. ప్రశ్నించినందుకే వెంగయ్యను చంపేశారని ఆయన ఆరోపించారు. వైసీపీ నేతలు కుటుంబ సభ్యులు కూడా ఆలోచించుకోవాలని.. వారి వైఖరి ఎలా ఉందో అని అన్నారు. ప్రశ్నించే వారి కుటుంబాలను ఛిద్రం చేయాలనుకుంటే కుదరదని అన్నారు.


దాష్టీకాలు ఎక్కువవుతుంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని వ్యాఖ్యానించారు. ‘‘జగన్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే చేసిన పనికి శిక్షిస్తారా.. మీకు ఆ ధైర్యం ఉందా..అన్నా రాంబాబు గుర్తుంచుకో నిన్ను అద:పాతాళానికి తొక్కేస్తాం’’ అని జనసేనాని హెచ్చరించారు. పోలీస్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. వెంగయ్య మృతి వైసీపీ పతనానికి నాంది అని స్పష్టం చేశారు. ‘‘ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై మీ చానెల్స్‌లో వేసుకోండి..తమ పేపర్స్‌లో రాసుకోండి..మీరు జర్నలిస్టులను కూడా వదలటం లేదు.. మీరు అనుకున్న వాళ్లే జర్నలిస్టులా..ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా.. ఫ్యూడలిస్ట్ వ్యవస్థలో ఉన్నామా జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి’’ అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

Updated Date - 2021-01-23T17:11:50+05:30 IST