రైతులకు అండగా పోరాటం: నాదెండ్ల

ABN , First Publish Date - 2021-12-03T23:48:42+05:30 IST

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా ఉండి వారి

రైతులకు అండగా పోరాటం: నాదెండ్ల

గుంటూరు: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా ఉండి వారి తరపున పోరాటం చేస్తామని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. కొల్లిపర మండలంలో వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. నందివెలుగు, అత్తోట గ్రామాలలో పడిపోయిన వరి పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం, అధికారులు నష్ట నివారణను అంచనా వేసి తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 




Updated Date - 2021-12-03T23:48:42+05:30 IST