‘ప్రజా జీవితంలో విశేష అనుభవం ఉన్న నేత యడ్లపాటి’

ABN , First Publish Date - 2022-02-28T16:09:19+05:30 IST

ప్రజా జీవితంలో విశేష అనుభవం ఉన్న నాయకులు యడ్లపాటి వెంకట్రావు తుది శ్వాస విడిచారనే విషయం బాధ కలిగించిందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.

‘ప్రజా జీవితంలో విశేష అనుభవం ఉన్న నేత  యడ్లపాటి’

అమరావతి: ప్రజా జీవితంలో విశేష అనుభవం ఉన్న నాయకులు యడ్లపాటి వెంకట్రావు తుది శ్వాస విడిచారనే విషయం బాధ కలిగించిందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో రాష్ట్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా, గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా  వెంకట్రావు చేసిన సేవలు మరువలేనివని చెప్పారు. తెనాలి, వేమూరు ప్రాంతాలతో ఆయనకున్న అనుబంధం విడదీయలేనిదని పేర్కొన్నారు. వ్యవసాయ రంగం, పాడి పరిశ్రమల అభివృద్ధి కోసం ఎన్నో ఆలోచనలు చేశారని గుర్తుచేశారు. వెంకట్రావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ... వారి కుటుంబానికి నాదెండ్ల ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Updated Date - 2022-02-28T16:09:19+05:30 IST