కోడాలి నాని మంత్రా...? పోరంబోకా..?: Janasena leader

ABN , First Publish Date - 2022-01-18T17:46:06+05:30 IST

మంత్రి కొడాలి నానిపై జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కోడాలి నాని మంత్రా...? పోరంబోకా..?: Janasena leader

గుంటూరు: మంత్రి కొడాలి నానిపై జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సంక్రాంతికి వైసీపీ కోడి పందాలు, పేకాట లకు పోలీసులు బాగా సహకరించారన్నారు.  ఖాకీ యూనిఫాంకు ఏపీ పోలీసులు మాయని మచ్చ చేస్తున్నారని మండిపడ్డారు. కొడాలి నాని మంత్రా...? పోరంబోకా ..? అని వ్యాఖ్యానించారు. సంక్రాంతి సందర్భంగా గుడివాడలో జరగని అసాంఘిక కార్యక్రమం లేదన్నారు. సీఎంకు చిత్తశుద్ది ఉంటే కోడాలి నానిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. అధికార పార్టీ నేతలు మాత్రం పేకాట, రికార్డింగ్ డాన్స్‌లతో బిజిగా ఉన్నారని ఆయన యెద్దేవా చేశారు.


జగన్ రెడ్డి పాద మహిమ రాష్ట్రంలో అన్ని పంటలు సర్వ నాశనం అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికలలో ప్రకటనలు తప్ప రైతులకు ప్రభుత్వం చేసింది శూన్యమన్నారు. టీడీపీ ప్రభుత్వం రెండేళ్లు, వైసీపీ ప్రభుత్వం రెండేళ్లు ఉద్యోగ విరమణ పెంచి యువతకు అన్యాయం చేశారని తెలిపారు. ప్రభుత్వం యువతను నిర్వీరం చేస్తోందని విమర్శించారు. సీఎం, గవర్నర్‌గా పని చేసిన రోశయ్యకు సీఎం జగన్ నివాళి అర్పించలేదని మండిపడ్డారు. ఆర్యవైశ్యులను మభ్యపెట్టేందుకే చింతామణి నాటకం అంశంతో డ్రామా ఆడారని గాదె వెంకటేశ్వరరావు ఆరోపించారు. 

Updated Date - 2022-01-18T17:46:06+05:30 IST