పనికి రాని మంత్రి పేర్నినాని: గాదె వెంకటేశ్వరరావు

ABN , First Publish Date - 2022-02-26T17:30:29+05:30 IST

జనసేన పార్టీ, కార్యకర్తలు చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు చేయలేదని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరావు అన్నారు.

పనికి రాని మంత్రి పేర్నినాని: గాదె వెంకటేశ్వరరావు

గుంటూరు: జనసేన పార్టీ, కార్యకర్తలు చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు చేయలేదని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరావు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... పనికి రాని మంత్రి పేర్నినాని అని వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీపై ఆధారరహితమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వైసీపీ నేతలే ‘‘భీమ్లా నాయక్’’ సినిమా టిక్కెట్లు బ్లాక్‌లో అమ్ముకున్నారని ఆరోపించారు. ‘‘పేర్ని నానికి సిగ్గుందా... ప్రభుత్వం ‘‘భ్లీమా నాయక్’’ సినిమాపై సర్క్యూలర్ విడుదల చేయడం సిగ్గు చేటు... యూరియా ఇవ్వలేరు. ధాన్యం కొనుగోలు చేయరు. రైతుల సమస్యలు పరిష్కరించరు... కానీ ‘‘భీమ్లా నాయక్’’ టికెట్స్ అమ్మకాలను మాత్రం కంట్రోలు చేస్తారు’’ అంటూ గాదె వెంటకేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-02-26T17:30:29+05:30 IST