మార్పు ఉపాధ్యాయులతోనే ప్రారంభం కావాలి: గాదె వెంకటేశ్వరరావు
ABN , First Publish Date - 2021-03-01T16:56:12+05:30 IST
ఉపాధ్యాయ సమస్యలపై ఉపాధ్యాయ సంఘాలు సక్రమంగా పనిచేయటం లేదని జనసేన గుంటూరు కృష్ణా జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి గాదె వెంకటేశ్వరరావు విమర్శించారు.
గుంటూరు: ఉపాధ్యాయ సమస్యలపై ఉపాధ్యాయ సంఘాలు సక్రమంగా పనిచేయటం లేదని జనసేన గుంటూరు- కృష్ణా జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి గాదె వెంకటేశ్వరరావు విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ యూనియన్ నేతలు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారని ఆరోపించారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పని చేయడం లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసమే తమ పార్టీ నేతలు పని చేస్తారని చెప్పారు. ఉపాధ్యాయులకు ప్రభుత్వమే కొత్త సమస్యలు సృష్టించిందని వ్యాఖ్యానించారు. నాడు నేడు పనులు, మిడ్ డే మీల్స్ వంటి అదనపు బాధ్యతలు అప్పగించారన్నారు. మార్పు ఉపాధ్యాయులతోనే ప్రారంభం కావాలని గాదె వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు.