కాపు కులద్రోహి అంబటి

ABN , First Publish Date - 2022-06-30T05:27:03+05:30 IST

వైపీసీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కాపు కులద్రోహి అని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు.

కాపు కులద్రోహి అంబటి
మాట్లాడుతున్న గాదె వెంకటేశ్వరరావు

జనసేన జిల్లా  అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు 

గుంటూరు, జూన్‌29: వైపీసీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కాపు కులద్రోహి అని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కాపులు పవన్‌ కల్యాణ్‌ వెంట నడవొద్దని, వైసీపీ వెంట నడవాలని ఎమ్మెల్యే అంబటి రాంబాబు వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో వ్యాఖ్యానించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు గాదె తెలిపారు. ముద్రగడ ఉద్యమాన్ని హైజాక్‌ చేసి కాపుల్సి మోసం చేసినందుకా? రిజర్వేషన్లు ఇవ్వనని ఖరాఖండిగా చెప్పినందుకా? కాపు కార్పోరేషన్‌ను నిర్వీర్యం చేసినందుకా? ఈబీసీ రిజర్వేషన్‌లను సైతం కాపులకు దక్కకుండా విద్యా, ఉద్యోగ అవకాశాల్లో తీరని అన్యాయం చేసినందుకా? కాపులు ఎందుకు వైసీపీ వెంట నడవాలని ? గాదె మండిపడ్డారు. సమావేశంలో జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ల హరి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-30T05:27:03+05:30 IST