అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరైన పవన్ కళ్యాణ్

ABN , First Publish Date - 2021-10-17T16:37:09+05:30 IST

ప్రతి ఏటా దసరా మరుసటి రోజు ‘దత్తన్న అలయ్ బలయ్’ కార్యక్రమం..

అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరైన పవన్ కళ్యాణ్

హైదరాబాద్ : ప్రతి ఏటా దసరా మరుసటి రోజు ‘దత్తన్న అలయ్ బలయ్’ కార్యక్రమం జలవిహార్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు ప్రముఖులు కలుసుకున్నారు. ఈసారి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కొద్దిసేపటి క్రితమే టాలీవుడ్ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. తెలంగాణ గవవర్నర్ తమిళ సై, ఏపీ గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అలయ్ బలయ్‌ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. తెలుగురాష్ట్రాల మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలయ్ బలయ్‌లో తెలంగాణ సంసృతి ఉట్టిపడే కళాకారుల నృత్యాలతోపాటు తెలంగాణ చడ్రుచుల వంటకాలు ఇక్కడ ప్రత్యేకం. దసరా తర్వాత ఒకరినొకరు కలుసుకోవడం, ఆలింగనం చేసుకోవడం అలయ్ బలయ్ ప్రత్యేకత.

Updated Date - 2021-10-17T16:37:09+05:30 IST